SAKSHITHA NEWS

మున్సిపాలిటీ భవనం కూడా కట్టలేని దౌరభాగ్య ప్రభుత్వం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి..!

టీడీపీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం ఉన్నం వరలక్ష్మి..!

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో 23వ వార్డు నందు బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి , మారుతి చౌదరి భార్య ఉన్నం వరలక్ష్మి , చీర పసుపు కుంకుమ ఇచ్చి మహాశక్తి పథకాలను విస్తృత ప్రచారం చేపట్టారు. అనంతరం వైఎస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి మున్సిపాలిటీ భవనం కూడా కట్టలేని దౌరభాగ్య స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత తప్పకుండా మున్సిపాలిటీ భవనం నిర్మిస్తామని ఉన్నం హనుమంతరాయ చౌదరి పేర్కొన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని అందుకు ప్రతి ఒక్కరూ ఆలోచించి తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం కోసం పాటుపడాలని ఉన్నం వరలక్ష్మి కోరారు…..

ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం మండల పార్టీ అధ్యక్షులు గోళ్ల వెంకటేశులు, మాజీ జెడ్పిటిసి కొల్లాపూరప్ప, మైనార్టీ నాయకులు షామీర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రహీం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మల్లిపల్లి నారయణ, మాజీ కోఆప్షన్ నెంబర్ మునీర్ ఖాన్, మాజీ డీలర్ ఇటుకుల రామాంజనేయులు, మాజీ కోఆప్షన్ నెంబర్ అన్వర్ భాష, శేఖర్, ఇబ్రహీం, మాబు, జిల్లా తెలుగు యువత కార్యదర్శి యాసిన్ భాష, భార్గవ్, మాజీ డీలర్, జిలాన్, అజీమ్ తుల్లా, లాల్ బంద్ పార్క్, ఇషాక్, బండి గోపాల్, ఓబులేష్, శీన, రాధాకృష్ణ, బేల్దారి చంద్రశేఖర్, పూజారి గోపి, బసవరాజు, బోర్ల గోపాల్, లక్ష్మీనారాయణ, ఓబులేసు, తపాల వెంకటేశులు, ఉటంకి రామాంజనేయులు, భార్గవ్, బోర్ల గోపాల్, మహిళలు కార్యకర్తలు వందలాది మంది పాల్గొన్నారు……


SAKSHITHA NEWS