యర్రగొండపాలెం (మండలం) :
బోయలపల్లి పంచాయతీ లోని గ్రామ సచివాలయానికి ఇరవై నెలలుగా
అద్దె చెల్లించకుండా వినియోగించుకుంటున్న నేపథ్యంలో తీవ్ర అసహనానికి గురైన భవన యజమాని గజ్జల చెన్నయ్య సచివాలయానికి తాళం వేసి తన నిరసనను వ్యక్తం చేశారు.. ఈ సంఘటనను తెలుసుకున్న ఎంపీడీవో మరియు ఎమ్మార్వో అక్కడికి చేరుకొని… యజమానిని పిలిపించి వివరములు అడగగా… తన పరిస్థితి బాగాలేదని కూలి పనులకు వెళ్తే గాని కుటుంబ పోషణ జరగటం లేదని… మా ఆడవాళ్ళకి ఆరోగ్యం బాగోలేక ఇరుగుపొరుగు వారి దగ్గర అప్పు చేసి మరి వైద్యం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని… ఎన్నోసార్లు సర్పంచ్ ను మరియు పంచాయతీ కార్యదర్శిని అద్దె చెల్లింపు విషయమై వివరణ అడగ్గా వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో… విసుగు చెంది వేరే దారి లేక సచివాలయానికి తాళం వేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. అనంతరం ఎమ్మార్వో రవీంద్రారెడ్డి చెన్నయ్య కి అద్దె చెల్లింపుల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వడంతో… సచివాలయ తాళాలు తెరుచుకున్నాయి…
గ్రామ సచివాలయానికి తాళం వేసిన యజమాని…
Related Posts
దేవాడ గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం.
SAKSHITHA NEWS దేవాడ గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం. సాక్షిత:- పరవాడ జీవీఎంసీ పెదగంట్యాడ మండలం 77వ వార్డు పరిధిలో గల కేఎస్ పాలెం మరియు దేవాడ గ్రామాలలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది అనే కార్యక్రమం…
అమరావతిలో MSME శిక్షణ కేంద్రం
SAKSHITHA NEWS అమరావతిలో MSME శిక్షణ కేంద్రం ఏపీ రాజధాని అమరావతిలో MSME 2వ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాలను కేటాయించింది. దీనిలో టెస్టింగ్ ఫెసిలిటీ కేంద్రాన్ని అందుబాటు లోకి తీసుకురానుంది. రూ.250 కోట్ల ఖర్చుతో దీన్ని…