SAKSHITHA NEWS

ప్రజా సమస్యల పరిష్కారమే జనవాణి లక్ష్యం
-ప్రజలు ఇచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించి న్యాయం చేస్తాం
-రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ
రాజానగరం, సాక్షిత :
ప్రజలు ఇచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించే దిశగా కృషి చేస్తామని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. అమరావతిలో జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే బలరామకృష్ణ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి నెల జనసేన ఎమ్మెల్యేలు అమరావతి లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసే జనవాణి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంట్లో భాగంగా బలరామకృష్ణ కూడా పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఆయా సమస్యలను అప్పటికప్పుడే పరిష్కారం చేసే దిశగా అధికారులతో ఆయనే స్వయంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సమస్యలతో పాటు భూ సంబంధిత వివాదాలకు చెందిన సమస్యలు ఫిర్యాదుల రూపంలో ఎమ్మెల్యే బలరామకృష్ణకు అందించడం జరిగింది. దీనిపై సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉత్తరాంధ్ర లీగల్ సెల్ ఇంచార్జ్ సనక సుబ్రహ్మణ్యం, వీరామహిళ డి. పవిత్ర, జనసేన స్టేట్ జాయింట్ సెక్రటరీ సుంకర రామిరెడ్డి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివ రామ్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS