ఆక్సిడెంట్ లో కాలు కోల్పోయిన బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే…

Spread the love

ఆక్సిడెంట్ లో కాలు కోల్పోయిన బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే…

మానవతాదృక్పథంతో స్పందించి తక్షణమే రూ.50 వేల ఆర్థిక సాయం అందజేత…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామం భోళా శంకర్ నగర్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మల్లేష్ యాదవ్ కు ఇటీవలే ఆక్సిడెంట్ కావడంతో ఈ ప్రమాదంలో తన కాలును కోల్పోయాడు.

ఈ మేరకు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. మానవతాదృక్పథంతో స్పందించి తక్షణమే తన వంతు రూ.50 వేల ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page