దుండిగల్ చెరువు వద్ద ‘సాగునీటి దినోత్సవ‘ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే…

Spread the love

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో దుండిగల్ చెరువు వద్ద నిర్వహించనున్న ‘సాగునీటి దినోత్సవ‘ ఏర్పాట్లను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సభలో రైతులు, ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిఈఈ సురేష్, మేడ్చల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవీందర్ యాదవ్, కౌన్సిలర్లు జక్కుల కృష్ణాయాదవ్, గోపాల్ రెడ్డి, ఆనంద్, పాక్స్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, నాయకులు జే.శ్రీనివాస్, బండారి మహేష్, కుంటి వెంకటేష్, జగన్ నాయక్, వీరస్వామి, పిట్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page