ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ఎర్రగడ్డ నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు..

Spread the love

The members of the Erragadda Nai Brahmin community thanked the MLA.

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ఎర్రగడ్డ నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు…

నాయి బ్రాహ్మణుల సమస్యలను అసెంబ్లీ వేదికగా మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఎర్రగడ్డకు చెందిన నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ని సీనియర్ నాయకులు రషీద్ బైగ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

కుల వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న నాయి బ్రాహ్మణులకు కార్పొరేట్ వ్యక్తులు, ఇతర కులస్తులు, ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారు సెలూన్ షాప్ లను ఏర్పాటు చేయడం ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నాయి బ్రాహ్మణులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ద్వారా ప్రత్యేక జీవో జారీ చేస్తే వారికి న్యాయం జరుగుతుందని అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page