నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

Spread the love

సాక్షిత : *రూ.40 లక్షలతో చేపడుతున్న కుత్బుల్లాపూర్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్ లో రూ.40 లక్షల వ్యయంతో నూతనంగా చేపడుతున్న కుత్బుల్లాపూర్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. నాయి బ్రాహ్మణుల ఆత్మగౌరవం పెంపొందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని విధంగా నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని అన్నారు. 250 యూనిట్ల ఉచిత కరెంటు, సబ్సిడీ రుణాలు, నైపుణ్య శిక్షణ వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం నాయి బ్రాహ్మణుల కొరకు చేస్తుందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సంజీవ రావు, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, నాయకుడు ఆబిడ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నాయిబ్రాహ్మణ సేవాసంఘం అధ్యక్షుడు ఏ.రేణయ్య నాయి, ప్రధాన కార్యదర్శి కే.పరమేష్ నాయి, చైర్మన్ ఎస్.రవిబాబు నాయి, వర్కింగ్ ప్రెసిడెంట్ బి.సురేష్ నాయి, బి.శ్రీనివాస్, గౌరవ అధ్యక్షడు మైలారం యాదగిరి నాయి, గంగుల శ్రీనివాస్ నాయి, క్యాషియర్ వి.మహేందర్ నాయి, మాజీ అధ్యక్షుడు వెంకటేష్ నాయి, మీడియా ప్రచార కార్యదర్శి బంటు ప్రవీణ్ నాయి, సలహాదారులు ఎం.బిక్షపతి నాయి, ఉపాధ్యక్షుడు ఎస్ఎంఎస్ సురేష్ నాయి, ఎం.కుమార్ నాయి మరియు నాయి బ్రాహ్మణ సోదరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page