SAKSHITHA NEWS

మహానాడుకు ప్రభుత్వం ఆటంకం సృష్టిస్తుంది

యాంకర్:- మే 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరుగు మహానాడుకు వైకాపా ప్రభుత్వం ఆటంకం సృష్టిస్తుందని జిల్లా టిడిపి పార్లమెంటరీ అధ్యక్షులు, ఆముదాలవలస మాజీ శాసనసభ్యులు కూన రవికుమార్ ఆరోపించారు.శ్రీకాకుళం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్లమెంటరీ నియోజకవర్గం ఇంచార్జ్ రవి కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు.రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, రాష్ట్రం పసుపుమయం కాబోతుందని అన్నారు. 28న రాజమండ్రిలో 15 లక్షల మందితో మహానాడు, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS