విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని ఎవరు ఆందోళన చెందవద్దని జిల్లా విద్యాధికారి

విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని ఎవరు ఆందోళన చెందవద్దని జిల్లా విద్యాధికారి

SAKSHITHA NEWS

The District Education Officer said that all the students are safe

image 23

రాజన్న సిరిసిల్ల జిల్లా :

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని అస్వస్థకు గురైన విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని ఎవరు ఆందోళన చెందవద్దని జిల్లా విద్యాధికారి ధనాలకోట రాధా కిషన్ తెలిపారు.

సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం రాధా కిషన్ మాట్లాడుతూ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట చేసే సమయంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన సంపులోని నీటి ద్వారా వంట చేయడం ద్వారా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలిపారు పూర్తి సమాచారం కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని మధ్యాహ్న భోజన సిబ్బందిని వివరణ కోరడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

బైట్ : దనాలకోట రాదాకిషన్ జిల్లా విద్యాధికారి రాజన్న సిరిసిల్ల జిల్లా


SAKSHITHA NEWS