SAKSHITHA NEWS

గుడివాడ వాంబే కాలనీలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీ విగ్నేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రతిష్ట వేడుకలు…..
స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే….*
స్వామివారి ఆశీస్సులతో గుడివాడ అభివృద్ధికి అడ్డుగా ఉన్న విఘ్నాలన్ని తొలగిపోవాలి :ఎమ్మెల్యే రాము….*

సాక్షిత గుడివాడ : గుడివాడ పట్టణం వాంబే కాలనీలో శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రతిష్ట వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
వేడుకల్లో భాగంగా విగ్రహ ప్రతిష్ట… శిఖర ప్రతిష్ట… మహా కుంభాభిషేక పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి.దేవస్థాన ప్రతిష్ట పూజల్లో భక్తులతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు.

ముందుగా వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే రాముకు వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి, యాగ,హోమ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాముకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేసి, దేవస్థాన సంప్రదాయం ప్రకారం సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడారు….. ప్రధమ పూజ్యుడైన శ్రీ విగ్నేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రతిష్ట వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషకరమన్నారు. స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్ర అభివృద్ధి…. గుడివాడ అభివృద్ధికి అడ్డుగా ఉన్న విగ్నాలన్ని తొలగిపోవాలన్నారు. రాబోయే వినాయక చవితి పర్వదిన వేడుకలను గుడివాడలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్న ఏర్పాట్లు చేస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము తెలియచేశారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

వేడుకల్లో భాగంగా భారీ అన్న సమారాధన నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలియచేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, వార్డ్ టిడిపి నాయకులు రెడ్డి అప్పారావు, శ్రీనివాస్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS