SAKSHITHA NEWS

వ్యవసాయ కార్మికుల మృతి దురదృష్టకరం

మృతులకు ఎంపీ నామ సంతాపం

కుటుంబాలకు సానుభూతి

క్షతగాత్రులకు మెరుగైన చికిత్స

క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని నామ ఆకాంక్ష

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఏన్కూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్లూరుకు చెందిన ఇద్దరు మహిళా వ్యవసాయ కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరం, దురదృష్టకరమని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మృతులకు సంతాపం తెలిపి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.మహిళా వ్యవసాయ కార్మికులు మిర్చి పనుల కోసం ఆటోలో వెళ్తూ ప్రమాదానికి గురికావడం తనను ఎంతగానో కదిలించిందని అన్నారు. గాయపడిన వ్యవసాయ కార్మికులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తుందని అన్నారు. క్షతగాత్రులంతా త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యం తో తిరిగి ఇంటికి చేరుకుంటారని నామ నాగేశ్వరరావు ఆకాంక్షించారు


SAKSHITHA NEWS