SAKSHITHA NEWS

ఆ భగవంతుని కృప, ప్రజల ఆశీసులు ఎల్లపుడు చంద్రబాబుకు తోడువుంటాయి

వేగేశన నరేంద్ర వర్మ
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి

బాపట్ల మండలములోని అప్పికట్ల గ్రామం లోని శ్రీ కాశి అన్నపూర్ణ విశ్వేశ్వర దేవాలయం నందు నారా చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని ఆయన త్వరగా జైలు నుండి బయటకు రావాలని అప్పికట్ల నాయకులతో కలసి స్వామి వారికీ అభిషేకాలు మరియు 108కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

దూరదృష్టి, నిజాయతి, నిబద్ధత కలిగిన వ్యక్తి ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు . అలాంటి వ్యక్తిని కుట్ర , కుతంత్రం తో అక్రమ అరెస్ట్ చేసి జైలు పంపించడం దారుణం

రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నిన నారా చంద్రబాబు నాయుడు ఒక కడిగిన ముత్యం లా బయటకు వస్తారని ఆ భగవంతుని కృప , ప్రజల ఆశీసులు ఎల్లపుడు ఆయనకు తోడువుంటాయని అన్నారు

ఈ కార్యక్రమము లో ఇనగంటి గాంధీ,ఆచంట అమరేష్, రమేష్, కంతేటి అప్పారావు,అమర్నాథ్, ప్రమోద్, పూర్ణచంద్రరావు, దశరదరామయ్య, ప్రభాకరరావు, ఇనగంటి పుణ్యవతి, చెన్నుపాటి ప్రజ్ఞాని మరియు అప్పికట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS