SAKSHITHA NEWS

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదిన సందర్భంగా భారతి నగర్ డివిజన్ పరిధిలోని MIG లో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ లలిత పోచమ్మ తల్లి దేవస్థానంలో జరిగిన బోనాల ఉత్సవాలలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ , నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా ప్రజలందరికి బోనాల పర్వదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని, అమ్మ వారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటున్నాను అని, ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వాడవాడలో బోనాల జాతర వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవలనే ఉద్దేశ్యం తో నియోజకవర్గం లోని ప్రతి గుడికి బోనాల నిధులు మంజూరయేలా కృషి చేశానని ,బోనాలు అంగరంగ వైభవంగా జరుపుకునేల  బోనాలు నిర్వహించుకొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరుచేయడం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాని, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాల అంగరంగా వైభవంగ పండుగల జరుపుకునేల కృషి చేస్తున్నారు అని , ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అన్ని రంగాలలో తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి కెసిఆర్    ముందుకు తీసుకెలుతున్నారని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు.

బోనాల సందర్భంగా ప్రతి గుడి వద్ద అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేశామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండ అన్ని రకాల వసతులు కలిపిస్తూ ప్రశాంత వాతావరణం కలిపించమని, బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగేల అన్ని ఏర్పాట్లను చేశామని, బోనాల పండుగ మంచి ప్రశాంత వాతావరణంలో జరిగినవి అని ప్రభుత్వ విప్ గాంధీ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్, రవీందర్ రావు, లక్ష్మీ నారాయణ గౌడ్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, భారతి నగర్ MIG డివిజన్ ప్రెసిడెంట్ భాస్కర్ , చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి,తెరాస నాయకులు మిర్యాల రాఘవరావు,జనార్దన్ రెడ్డి, సత్యనారాయణ, సురేందర్, నరేందర్ బల్ల, దాస్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS