తెలంగాణ గురుకుల జేఎల్ డిఎల్, పరీక్ష ఫలితాలు విడుదల

Spread the love

తెలంగాణ సంక్షేమ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు సాయంత్రం విడుదల య్యాయి.

ఈ మేరకు ఫలితాలను గురుకుల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 1,924 పోస్టుల భర్తీకి గానూ ఈ నియామక ప్రక్రియ చేపట్టింది.

జేఎల్‌ పోస్టులకు ఎంపికైన వారి ప్రాథమిక ఎంపిక జాబితాలను సబ్జెక్టుల వారీగా వెబ్‌సైట్‌లో పొందు పరిచారు. జేఎల్‌ రాత పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు ఈ కింది లింక్‌ల ద్వారా నేరుగా ఫలితాను చెక్‌ చేసుకోవచ్చు.

కాగా గతేడాది ఆగస్టు 3 నుంచి 23వ తేదీ వరకు జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. దివ్యాంగుల కేటగిరీకి సంబంధించిన ఫలితాలు త్వరలోనే ప్రకటించ నున్నట్లు బోర్డు ఈ సందర్భంగా వెల్లడించింది..

Related Posts

You cannot copy content of this page