SAKSHITHA NEWS

సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

కళాశాల అధ్యాపకులను సన్మానించిన ప్రిన్సిపల్ పెరుమళ్ళ యాదయ్య

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : ప్రతి విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుడి పాత్ర కీలకమైందని సమాజ నిర్మాణంలో బాధ్యతాయుతంగా పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడు ఆదర్శనీయుడేనని సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పెరుమాండ్ల యాదయ్య అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తూ వారిని ఉన్నత స్థానంలో చూసి మురిసిపోతారన్నారు. విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకునేందుకు తన శక్తినంత కూడదీసి తనకు తెలిసినదంతా విద్యార్థికి చెబుతాడన్నారు. అలాంటి ఉపాధ్యాయుల సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. అనంతరం కళాశాల అధ్యాపకులను ప్రిన్సిపల్ యాదయ్య సన్మానించగా కళాశాల అధ్యాపకులంతా కలిసి ప్రిన్సిపల్ యాదయ్యను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు వివిఎస్ ప్రసాద్, వాసు, సైదులు, గురువయ్య, బషీరున్నిసా బేగం, నవీన్, ప్రవీణ్, దివ్య, శ్రీనివాస్, లలిత, జ్యోతి, కృష్ణ, శంకర ప్రసాద్ లతో పాటు అజపకులు కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS