SAKSHITHA NEWS

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
పాఠశాల అభివృద్ధికి 10వేలు విరాళంగా అందజేసిన రిటైర్డ్ టీచర్ పద్మలీల


సాక్షిత న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దైద పాపయ్య డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి. అనంతరం మాట్లాడుతూ ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతులను వెలిగించేవాడని విద్యార్థులను క్రమశిక్షణతో నడిపిస్తూ, మాతృభాష గొప్పతనాన్ని, తెలుగు భాషలోని మాతృత్వాన్ని వివరిస్తూ, ఉపాద్యాయ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని కోరారు. విద్యార్థులు ఆట పాటలతో, కవితా సూక్తులతో ఉల్లాసంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ గా విధులు నిర్వర్తించి రిటైర్డ్ అయిన స్కూల్ అసిస్టెంట్ పద్మలీల పాఠశాల అభివృద్ధికి 10 వేల రూపాయలను విరాళంగా అందజేసి భగవంతుని అశీసులతో పాఠశాల అభివృద్ధికి నావంతు కృషి చేస్తూ ఉంటానని తెలిపారు .ఈ కార్యక్రమంలో కోటి రెడ్డి, ఎం.డీ సాలేహ బేగం, కిరణ్ కుమార్, వసంత, మంజుల, రాధిక, అరుంధతి, పద్మ లీల, నవీన్, జయమ్మ, రామకృష్ణ, విద్యార్థులు, తదితరులు హాజరయ్యారు.


SAKSHITHA NEWS