SAKSHITHA NEWS

40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన శ్రీ నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టు, కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా జాతీయ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో బాపట్ల పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సాయంత్రం వేగేశన నరేంద్ర వర్మ టిడిపి నాయకులకు, కార్యకర్తలకు,నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమించారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS