గిద్దలూరులో ఘనంగా టీడీపీ అధినేత జన్మదిన వేడుకలు

Spread the love

టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన ముత్తుముల అశోక్ రెడ్డి

ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు \జన్మదిన వేడుకలను టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అశోక్ రెడ్డి \కేక్ కట్ చేసి టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు తినిపించారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో నష్టపోయిన ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావటం ఖాయమన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గోన్నారు..

Related Posts

You cannot copy content of this page