SAKSHITHA NEWS

బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణిత వ్యవధిలోగా పూర్తి చేయాలి.

  • జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణిత వ్యవధిలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం ఐడిఓసి సమావేశ మందిరంలో అధికారులు, బ్యాంకర్లతో కలెక్టర్ డిసిసి/డిఎల్ఆర్ సి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో బ్యాంకుల్లో రూ. 8,936.50 కోట్ల డిపాజిట్లు, రూ. 15,322.24 ల అడ్వాన్సులు ఉన్నట్లు తెలిపారు. 2022-23 సంవత్సరానికిగాను స్వల్పకాలిక పంట రుణాల క్రింద రూ. 2,887 కోట్ల లక్ష్యానికి గాను, రూ. 2,434 కోట్లు, ఏజిజి టర్మ్ లోన్ల క్రింద రూ. 768 కోట్ల లక్ష్యానికి గాను రూ. 1,206 కోట్లు, అగ్రి ఇన్ఫ్రా క్రింద రూ. 164 కోట్ల లక్ష్యానికి గాను రూ. 30 కోట్లు, అనుబంధ రంగాలకు రూ. 780 కోట్ల లక్ష్యానికి గాను రూ. 161 కోట్ల ప్రగతిని, మొత్తంగా వ్యవసాయానికి రూ. 4,599 కోట్ల లక్ష్యానికి గాను రూ. 3,831 కోట్ల ప్రగతి సాధించినట్లు తెలిపారు. ఎంఎస్ఎంఇ క్రింద రూ. 518 కోట్ల లక్ష్యానికి రూ. 1,000 కోట్లు, విద్యా రుణాల రూ. 190.96 కోట్ల లక్ష్యం ఉండగా రూ. 20 కోట్లు, హౌజింగ్ రుణాల క్రింద రూ. 446 కోట్ల లక్ష్యానికి గాను రూ. 57 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ. 47 కోట్ల రుణాల లక్ష్యానికి గాను రూ. 93 కోట్లు, మొత్తంగా రూ. 5,801 కోట్ల రుణ వితరణ లక్ష్యానికి గాను రూ. 5,001 కోట్ల ప్రగతిని సాధించినట్లు ఆయన అన్నారు. ప్రాధాన్యత లేని రంగాలకు రూ. 169 కోట్ల రుణాల అందజేత లక్ష్యానికి గాను రూ. 2,719 కోట్ల ప్రగతిని సాధించినట్లు ఆయన తెలిపారు.

బలహీన వర్గాలకు రుణాల అందజేతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదార్లకు రుణాలు అందజేయాలన్నారు. రైతులకు బ్యాంకుల ద్వారా అందించే పంట రుణాలు సకాలంలో అందించి వారికి చేయూతను అందించాలని ఆయన తెలిపారు. భూ రికార్డులు లేని చిన్న సన్నకారు రైతులను గుర్తించి, వారికి రుణాలు అందించుటకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రభుత్వ జీవో నెం. 58 ద్వారా క్రమబద్దీకరణ చేయబడి పట్టాలు పొందిన వారికి గృహ నిర్మాణ రుణాలు అందించాలన్నారు. సబ్సిడీ రుణాల గ్రౌండింగ్ త్వరితగతిన చేయాలన్నారు.

లబ్ధిదారుల ఎంపిక కమిటీ సమావేశాల్లో బ్యాంకర్లు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. బ్యాంకర్ల నుండి పెండింగ్ యుసి లను వెంటనే సంబంధిత శాఖలకు పంపాలన్నారు. బ్యాంక్ లింకేజీ క్రింద స్వయం సహాయక సంఘాలకు రుణాల లక్ష్యాన్ని వచ్చే మహిళా దినోత్సవం లోగా పూర్తి చేయాలన్నారు. క్రొత్త ఆసరా పెన్షన్లు మంజూరు అయి, ఆధార్ తదితర సమస్యలతో పంపిణీ కాకుండా ఉన్నాయని, వెంటనే సమస్య పరిష్కరించాలని అన్నారు. ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యతకై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రతి బ్యాంకు బ్రాంచిలో ఇవ్వనున్న సదుపాయాల విషయమై నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలన్నారు. ముద్ర రుణాలతో పాటు స్టాండ్ అప్ ఇండియా కింద రుణాలు అందించాలన్నారు.

పీఎం స్వానిది, పీఎంఇజిపి పథకాలు లక్ష్యం మేరకు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస రెడ్డి, ఆర్బీఐ ఎల్డివో అనిల్ కుమార్ కల్బోరే, నాబార్డు డీడీఎం సుజిత్ కుమార్, ఎస్బిఐ ఆర్ఎం నారాయణ, యూబీఐ ఎజిఎం రాజశేఖర్, ఏపీజీవిబి ఆర్ఎం విజయ భాస్కర్ గౌడ్, డిసిసిబి జీఎం నర్మద, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి అజయ్ కుమార్, డిఆర్డీఓ విద్యాచందన, జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, జిల్లా ఉద్యానవన అధికారి అనసూయ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కృష్ణ నాయక్, జెడ్పి సిఇఓ అప్పారావు, ఇడి ఎస్సి కార్పొరేషన్ ఏలూరి శ్రీనివాసరావు, జిల్లా సంక్షేమ అధికారిణి సంధ్యారాణి, అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS