కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Spread the love

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మండలం బోయగుబ్బ గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ అందత్వ నివారణ చర్యలో బాగంగా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు.18 సంత్సరా ల పైబడిన అవసరం ఉన్న వారికి ఉచిత మందులు మరియు కళ్ళ అద్దాలు పంపిణీని చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కంచర్ల వెంకటరెడ్డి, వైద్యాధికారి యు.నర్సింహ, కంటి వెలుగు వైద్యనిపుణురాలు డా.లావణ్య ఏఎన్ఎంలు సరస్వతి, మాధవీలత, వార్డు సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page