సర్వే no – 49 ఆగని భూకబ్జాలు

Spread the love

సర్వే no – 49 ఆగని భూకబ్జాలు

కత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం మెయిన్ రోడ్ పైన గల సర్వే no – 49 లో ఆగని భూకబ్జాలు, రాత్రి కి రాత్రికి బేసమెంట్లు తెలిరిసరికి రూములు, అత్యంత సమీపంలో గల రెవిన్యూ ఆఫీస్, అయిన ఇక్కడ ఆగని భూ కబ్జాలు ఇక్కడి తాసిల్దార్ మరియు రెవిన్యూ ఇన్స్పెక్టర్ లు మాత్రం తమకి ఏమి పట్టనట్టు వ్యవహారిస్తున్నారు అని స్థానికులు అంటున్నారు వాళ్ళు తమ విధులు నిర్వహిస్తే ఇక్కడ ఇన్ని రూములు ఎలా వెలుస్తాయని ప్రశ్నిస్తున్నారు,

ఇక్కడి భూమి మొత్తం కబ్జాలు అయినంక అధికారులు తమ చేతులు దులుపుకోటానికి అంత ఆక్రమించారు అని ఇక్కడ ఏమి లేదు అని ఉన్నత అధికారులకి రిపోర్ట్ పంపుతారు, ఎందుకు అంటే వాళ్ళకి అందాల్సినవి అన్ని కబ్జాదారుల నుంచి అందుతాయి అధికార్లకి భూ కబ్జాదారుల మీద అందుకనే చర్యలు తీసుకోరు అని కూడా భోగట్ట,

ఏదైనా గట్టిగ అధికారులని ప్రశ్నిస్తే తప్పని స్థితులో నామమాత్రంగా కేసులు పెడతారు కట్టిన వాటిని మాత్రం వీళ్ళు చూసి చూడనట్టు పోతారు, సర్వే no 49 మెయిన్ రోడ్ సమీపంలో ఇంత జరుగుతున్న పట్టించు కోవటంలేదు అంటే మీరే అర్ధం చేసుకువాలి అంటున్నారు ఇక్కడి స్థానికులు, కొంతమంది అయితే రెవిన్యూ అధికారుల మీద ఏసీబీ నిఘా పెడితే ఇలాంటి వాటిని అరికట్ట వచ్చు అని కూడా అంటున్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page