SAKSHITHA NEWS

మంత్రి కేటీఆర్ ని కలిసిన రాష్ట్ర పిఎసిఎస్ చైర్మన్ ఫోరం మరియు మహబూబ్నగర్ జిల్లా ఫోరం సింగిల్ విండో చైర్మన్

సాక్షిత హైదరాబాద్: హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ని కలిసిన రాష్ట్ర పిఎసిఎస్ చైర్మన్ ఫోరం మరియు మహబూబ్నగర్ జిల్లా ఫోరం సింగిల్ విండో చైర్మన్ ల గౌరవ వేతనం గురించి మరియు ప్రోటోకాల్ విషయంపై చర్చించడం జరిగింది.సానుకూలంగా స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి తప్పకుండా మీ సమస్యలను తీర్చుతామని హామీ ఇవ్వడం జరిగింది మునుగోడు ఎన్నికల తర్వాత మళ్లీ ఒకసారి కలవాలని తెలియజేశారు

తమ వంతు బాధ్యతగా తెలంగాణ రాష్ట్ర 928 మంది సింగిల్ విండో చైర్మన్లు పది రోజులపాటు మునుగోడు ఎన్నికల్లో పాల్గొని రైతులకు రైతుబంధు రైతు బీమా అన్ని విషయాలు తెలియజేసి టిఆర్ఎస్ పార్టీ గెలవడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ ల రాష్ట్ర అధ్యక్షులు మరియు వారి కార్యవర్గం జిల్లా ఫోరం అధ్యక్షులు పోతుల మధుసూదన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి పాలెం సుదర్శన్ గౌడ్ మరియు వారి ఫోరం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS