ఇళ్ల స్థలాలు స్థలాల సాధన కోసం దశల వారి పోరాటాలు

Spread the love

టిడబ్ల్యూజేఎఫ్ సంతకాల సేకరణకు విశేష స్పందన

టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎస్ కె. సలీమా, తన్నీరు శ్రీనివాస్

కుత్బుల్లాపూర్,

జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీడిమెట్ల ప్రెస్ క్లబ్ ఆవరణలో మంగళవారం చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సుమారు వందమంది జర్నలిస్టులు హాజరై ఇండ్లు ఇండ్లసలాల సాధన కోసం సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇన్ చార్జీ నియమితులైన ఎస్ కె. సలీమా, సిద్దిపేట జిల్లా ఇన్ చార్జీ నియమితులైన రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాసులును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎస్.కె సలీమా, తన్నీరు శ్రీనివాసులు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం టిడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఇళ్లు, ఇళ్ల స్థలాల సాధన కోసం దశలవారి ఆందోళన కార్యక్రమాలకు పిలుపు నివ్వడం జరిగిందన్నారు. జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెలలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సాధన కోసం చేపట్టనున్న ఆందోళన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వారు అభినందించారు. మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మెరుగు చంద్రమోహన్ మండపాక కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ళ సాధన కోసం చేపట్టనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుమ్మడి హరిప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శులు యాట రాజు, టి.రమేష్, కావలి మోహన్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అధ్యక్షుడు గడ్డమీది అశోక్, జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గారావు, వీరేష్ ముదిరాజ్, నాగరాజు, డప్పు రామస్వామి, శేఖర్, నామా మోహన్, నగేష్,, దివాకర్, జి. ఆంజనేయులు, మెరుగు విష్ణు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page