అఖిల భారత గౌడ సంఘం మండలం అధ్యక్షునిగా శ్రీనివాస్ గౌడ్

Spread the love

అఖిల భారత గౌడ సంఘం మండలం అధ్యక్షునిగా శ్రీనివాస్ గౌడ్

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

అఖిల భారత గౌడ సంఘం నల్గొండ జిల్లా చిట్యాల మండలం అధ్యక్షులుగా చెరుకు శ్రీనివాస్ గౌడ్ ను
నియమించడం జరిగింది.
అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర కార్యాలయంలో అఖిలభారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కూరెళ్ళ వేములయ్య గౌడ్ చేతుల మీదుగా నియామకపత్రాలను అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా కూరెళ్ళ వేములయ్య గౌడ్ మాట్లాడుతూ రాబోయే కాలంలో గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన గీత కార్మికులకు యువకులకు ప్రోత్సహిస్తూ వారికి వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ అఖిల భారత గౌడ సంఘం నియమ నిబంధనలకు కట్టుబడి, గౌడ సామాజిక వర్గంతో కలిసికట్టుగా ఉంటూ అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఉండాలని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి మిద్దెల మల్లేశం గౌడ్, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కేశగొని శ్రీవాణి గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు నందగిరి ఆంజనేయులు గౌడ్, గౌడ సంఘం నాయకులు పులి పలుపుల ఆనందం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page