పిఠాపురంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీ రామచంద్ర యాదవ్

Spread the love

పిఠాపురంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీ రామచంద్ర యాదవ్

  దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం క్షేత్రంలో పలు ఆలయాలలో ప్రత్యేక పూజలును బీసీవై పార్టీ  జాతీయ అధ్యక్షులు శ్రీ రామచంద్ర యాదవ్ నిర్వహించారు. మొదటగా పంచ మాధవ క్షేత్రాలైన శ్రీ కుంతి మాధవ స్వామి సన్నిధానంలో ఆయనకు ఆలయ అర్చకులు అత్యంత ఘన స్వాగతం పలికి, కుంతి మాధవ స్వామికి ప్రత్యేక అర్చన జరిపి తనంతరం శ్రీ రామచంద్ర యాదవ్ ను ఆశీర్వదించారు.

తదనంతరం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీ పురుహూతకా అమ్మవారును, శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారిని, శ్రీ దత్తాత్రేయ స్వామివార్లకు ఆయన ప్రత్యేక పూజలు జరిపారు.
తదనంతరం కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ శైవ & త్రిగయక్షేత్రమైన పాదగయ క్షేత్రంలో సహస్ర జ్యోతి లింగార్చన దీపాలను పండితుల వేదమంత్రాల సాక్షిగా ఆయన వెలిగించారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page