కానిస్టేబుల్ అభ్యర్ధుల పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి – యస్.పి అపూర్వ రావు

Spread the love

కానిస్టేబుల్ అభ్యర్ధుల పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి – యస్.పి అపూర్వ రావు
మొత్తం 25 పరీక్ష కేంద్రాలలో 11239 మంది అభ్యర్థులకు పరీక్షా నిర్వహణ
రాత పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు – యస్.పి
నల్లగొండ (సాక్షిత ప్రతినిధి)

పోలీస్ కానిస్టేబుల్ తుది పరీక్ష నిర్వహణకు పోలీస్ నియామక మండలి సూచనల ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా యస్.పి అపూర్వరావు ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా యస్.పి మాట్లాడుతూ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్దకు గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. రాత పరీక్ష కోసం నల్లగొండ పట్టణ కేంద్రంలో 25 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి 11,239 మంది అభ్యర్థులు పరీక్షకు అర్హత సాధించారని వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్,ఇంటర్ నెట్ సెంటర్స్, అన్ని మూసి వేయాలని,పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దు అని తెలిపారు. పరీక్ష నిర్వహణకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందనీ తెలిపారు.ఈ సందర్భంగా అభ్యర్థులకు యస్.పి పలు సూచనలు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించబడదు.అభ్యర్థులు తమ హాల్ టికెట్ పై పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అంటించుకొని రావాలి. లేనిచో పరీక్షకు అనుమతించరని అన్నారు.పరీక్షా కేంద్రంలోకి బ్యాగులు,సెల్ ఫోన్లు, ఏలక్రానిక్ వాచ్లు, క్యాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దు. బయోమెట్రిక్ వేలిముద్రల హాజరు నమోదు చేస్తారు. కాబట్టి మెహిందీ,టాటూలూ పెట్టుకోవద్దు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ జారీ చేసిన హాల్ టికెట్, బ్లాక్, బ్లూ పెన్, మాత్రమే తీసుకురావాలని, పరీక్ష వేళలు ముగిసేవరకు అభ్యర్థులు హాల్ లోనే ఉండవలెను.ఒకసారి పరీక్షా హలు లోకి అనుమతించిన తరువాత పరీక్షా పూర్తి అయిన అనంతరం మాత్రమే బయటకు అనుమతిస్తారని తెలిపారు.

Related Posts

You cannot copy content of this page