SAKSHITHA NEWS

సింహాచలం అప్పన్న స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న హోం మంత్రి వంగలపూడి అనిత..

సాక్షిత :- సింహాచలం అప్పన్న స్వామి తొలిపవచ్ వద్ద కొబ్బరికాయ కొట్టి ఒక వెయ్యి నలపై మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకున్న హోం మంత్రి.మెట్లు మార్గంలో ఉన్న దేవత మూర్తులనుదర్శించుకుంటూ భక్తులతో మాట్లాడుతూ వారితో సెల్ఫీ ఫోటోలు తీసుకుంటూ ఉత్సాహంగా కొండకు చేరుకున్న వంగలపూడి అనిత.ఆలయ మర్యాదలతో హోంమంత్రికి పూలమాలతో స్వాగతం పలికిన ఆలయ ఈఓ మరియు అధికారులు.కప్పస్తంభం ఆలింగనం స్వామివారిని దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదం అందజేసిన ఆలయ అధికారులు.

మెట్లు మార్గం గుండా స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను.లక్షలాది మంది భక్తులు నడిచి వచ్చే మెట్లుమార్గాన్ని గత వైసిపి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.తెలుగుదేశం ప్రభుత్వంలో కొత్త మెట్లు మార్గాన్న చైర్మన్ అశోక్ గజపతిరాజు మొదలుపెట్టగా వైసీపీ ప్రభుత్వం దాన్ని మధ్యలోనే నిలిపివేసింది.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆలయ ఈఓ కి చెప్పడం జరిగింది.లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్ పై ఉండాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది..


SAKSHITHA NEWS