SAKSHITHA NEWS

శ్రీవారి సేవలో మంత్రి అజయ్
కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పువ్వాడ అజయ్

సాక్షిత : తిరుమల వెంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఐటీవల తన కుమారుని వివాహమైన సందర్భంగా వీఐపీ బ్రేక్‌ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు వేదపండితులు ఆశీర్వచనం అందించగా, టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు.

అనంతరం మంత్రి అజయ్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు ప్రగతిపథంలో నడవాలని ఆకాంక్షించారు.
సీఎం కేసీఆర్‌ దేశ రాజకీయాల్లో కీలక బూమిక పోషిస్తారని ఆయన నాయకత్వాన్ని యావత్‌ భారత్‌ కోరుకుంటున్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలవ్వాలని సహజ వనరులతో తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అభివృద్ధి చేశారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.


SAKSHITHA NEWS