SAKSHITHA NEWS

కిషన్ రెడ్డి పై సీతక్క

కిషన్ రెడ్డిని అరెస్ట్ చేసే అంత అవసరం లేదు.

బీజేపీ బీఆర్ఎస్ డ్రామా చేస్తున్నాయి.

డబుల్ బెడ్ రూం సమస్య ఎప్పటి నుండో ఉంది.

ఈశాన్య రాష్ట్రాల మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సైలెంట్ గా ఉన్నాడు.

తన సైలెన్స్ డైవర్ట్ చేసుకోవడానికి కిషన్ రెడ్డి ఈరోజు తెలంగాణలో డ్రామా చేశాడు.

కిషన్ రెడ్డి తెలంగాణలో తిరిగే ముందు ఈశాన్య రాష్ట్రాల్లో తిరగాలి.

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కిషన్ రెడ్డి సమావేశాల్లో పాల్గొనకుండ ఇక్కడేం చేస్తున్నారు

గాంధీ భవన్

సీతక్క

మణిపూర్ లో దారుణం జరుగుతోంది.

79 రోజుల తర్వాత ప్రధాని మాట్లాడడం బాధాకరం

ఆయనకు ఏం తెలియనట్లుగా చెబుతున్నారు

ప్రజలు తనపై వ్యక్తం చేస్తున్న ఆగ్రహాన్ని తగ్గించడానికి మోదీ మాట్లాడాడు

మణిపూర్ సంఘటన సభ్యసమాజం సిగ్గుపడేలా వుంది

కుకీ తెగపై దాడులు, హత్యాచారాలు బాధాకరం

గత నెలలో రాహుల్ పర్యటనను అడ్డుకుంది బిజెపి సర్కార్

మహిళలు బయటికి రావొద్దని వేడుకున్నారు

మన దేశంలోనేనా జరిగేది అన్నట్లుగా వుంది

బిజెపి సర్కార్ వైఫల్యమే

ఈశాన్యరాష్ట్రాలకు వున్న స్పెషల్ స్టేటస్ ను తొక్కిపెట్టే ప్రయత్నం

ఓటు బ్యాంకు రాజకీయాలే తప్పా మరేం లేవు

పిల్లలు అని చూడకుండా హత్యాచారాలు జరుగుతున్నాయి

మణిపూర్ సీఎం కూడా ఇవేం కొత్తవి కాదని చెప్పడం బాధాకరం

కొట్లాటలు జరుగుతుంటే అక్కడి సీఎం, పీఎం డిస్కస్ చెయ్యలేదా

దుర్మార్గంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తోంది

ఈశాన్య రాష్ట్రాల కు ఇంచార్జి గా వున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడ్డం లేదు

గుజరాత్ లో మోడీ సీఎం గా వున్నప్పుడే గోద్రా ఘటనలో వేలాది మహిళలు చనిపోయారు

బిజెపి సర్కార్ రాజకీయం కోసమే తప్పా ప్రజల కోసం మానవత్వం కోసం పనిచేయడం లేదు.

యునైటెడ్ ఇండియా టీమ్ కూడా మణిపూర్ కోసం పనిచేస్తుంది

మణిపూర్ లో జరిగే ఘటనలు బయటికి రావడం లేదు

ఆర్మీ, నెట్ వర్క్ అంతా బిజెపి చేతుల్లోనే వుంది

మోడీ ఈ దేశంకోసమే పనిచేస్తున్నారా.. లేక పక్క దేశం కోసం పనిచేస్తున్నారా..

మణిపూర్ ప్రజలకు మోడీ, అమిత్ షా, కిషన్ రెడ్డిలు బహిరంగ క్షమాపణలు చెప్పాలి

లేదంటే రాజీనామా చేయండి

మానవహక్కులు కాలరాసేలా ఘటనలు మణిపూర్ తోపాటు బిజెపి పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నాయి.


SAKSHITHA NEWS