ఎస్సీ కాలనీలకు శృశాన స్థలాలు కేటాయించాలి

Spread the love

ఎస్సీ కాలనీలకు శృశాన స్థలాలు కేటాయించాలి

పివీ రావు మాల మహానాడు ఉమ్మడి కృష్ణ జిల్లా అధ్యక్షులు గోగులమూడి రాజు

కంకిపాడు: మండలంలోని ఎస్సీ కాలనీలకు శృశాన స్థలాలు కేటాయించాలని పివి రావు మాల మహానాడు ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షులు గోగులమూడి రాజు కంకిపాడు మండల తాసిల్దార్ టీవీ సతీష్ ను కలిసి వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో గోగులమూడి రాజు మాట్లాడుతూ జిల్లాలో 80 శాతం ఎస్సీ కాలనీలకు శృశాన స్థలాలు లేవని డొంకలు, రహదారులు అంచుల్లోనే ఖననం, (అంత్యక్రియలు) చేయాల్సివస్తుందని అన్నారు.
దళితవాడలకు భూమి సేకరించాలని ప్రభుత్వ ఆదేశించిన ఫలితం లేకుండా పోతుందని అన్నారు. మండలంలో ఉన్న దళితవాడలకు భూమి సేకరించి నిధులు కేటాయించి బోరు, షెడ్డు, నిర్మాణం ద్వారా అభివృద్ధి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గం అథధ్యక్షులు పైయర్థ రామకృష్ణ. నియోజకవర్గం సలహాదారులు బేతాళ అజయ్ బాబు. తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page