SAKSHITHA NEWS

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని యస్ బి ఐ కాలనీలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అర్బన్ బయోడైవర్సిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నేడు తెలంగాణ హరితోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం జరిగిందని ఆకుపచ్చని తెలంగాణను ఆవిష్కరించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 7.7% పెరిగిన పచ్చదనం. భూమిపై పచ్చదనాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టింది మూడవ మానవ మహా ప్రయత్నం ‘‘తెలంగాణకు హరితహారం’’ అని కార్పొరేటర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి పిల్లి తిరుపతి, జాహేద్ షరీఫ్ బాబా, జ్ఞానేశ్వర్, సంపత్ రెడ్డి, కమ్మరి శ్రీనివాస్, మల్లేష్, బద్రు నాయక్, రవీందర్ రెడ్డి, భాస్కర్ నాయక్, సంజీవ రెడ్డి, రాము యాదవ్, యోగి రాజు, బ్రహ్మ, మనెమ్మ, లక్ష్మి, నాజ్మ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS