కొత్తరంగాపురంలో రూ.1.కోటితో రహదారి అభివృద్ధి.

Spread the love

రహదారి అభివృద్ధికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.

ప్రాధాన్యత క్రమంలో సమస్యల పరిష్కారం.

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,

మైలవరం నియోజకవర్గ పరిధిలోని కొత్త మంగాపురం గ్రామంలో రూ.1.కోటితో నిర్మించనున్న రహదారి అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు శంకుస్థాపన చేశారు. 500 మీటర్ల పొడవునా ఐ.కె రోడ్డు (ఇబ్రహీంపట్నం-కొండూరు) నుంచి రుద్రవరం వరకు వయా కొత్తమంగాపురం మీదుగా సిమెంట్ రహదారి నిర్మించనున్నారు. దీనికి రహదారులు భవనముల శాఖ నుంచి క్యాపిటల్ గ్రాంట్ నిధులు 100 లక్షలు మంజూరయ్యాయి.

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ

మైలవరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సమస్య తీవ్రతను బట్టి ప్రాధాన్యత క్రమంలో నిధులను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. సిమెంట్ రహదారి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కి హారతులు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 05 At 12.42.23 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page