SAKSHITHA NEWS

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

రెడ్డి యువజన సంక్షేమ సంఘం చిట్యాల వారి ఆధ్వర్యంలో చిట్యాల పట్టణంలో ఎవరైనా పేద మధ్యతరగతి ప్రజలు చనిపోయిన సందర్భాలలో అంత్యక్రియలు చేస్తున్న సమయంలో జరుగుతున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందుల గురించి చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి కమిషనర్ మరియు పాలకమండలికి వినతి పత్రం అందజేయడం జరిగింది. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు అంత్యక్రియలకు సంబంధించి వారికి అందుబాటులో ఉండే విధంగా ఒక నిర్ణీతమైన మొత్తాన్ని నిర్ణయించి దానిని అమలుపరచవలసిందిగా వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో రెడ్డి యువజన సంక్షేమ సంఘం నాయకులు బొబ్బలి శివశంకర్ రెడ్డి, పాటి మాధవరెడ్డి తోకల నరేందర్ రెడ్డి జమాన్ల శ్రీనివాస్ రెడ్డి గోధుమ గడ్డ యాదిరెడ్డి గోధుమ గడ్డ బుచ్చిరెడ్డి ముప్పా శ్రీనివాసరెడ్డి వరకాంతం నరేందర్ రెడ్డి జగిని బిక్షం రెడ్డి వరకాంతం భాస్కర్ రెడ్డి కొమిడాల మహేందర్ రెడ్డి ముప్పా కృష్ణారెడ్డి కంది మోహన్ రెడ్డి గోధుమ గడ్డ మాధవరెడ్డిలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS