మత సామరస్యానికి ప్రతీక రంజాన్.

Spread the love

మైలవరం తెదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్

కొండపల్లిలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు.

ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి మున్సిపాలిటీ,

మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని, ఈ రంజాన్ పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని మైలవరం తెదేపా కూటమి అభ్యర్ధి, స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.

కొండపల్లిలో కొండపై ఈద్ గా వద్ద రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల్లో శాసనసభ్యులు కృష్ణప్రసాదు పాల్గొన్నారు. హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా వారి ఆస్థాన పీఠాధిపతి అల్తాఫ్ బాబా వారిని ప్రత్యేకంగా కలసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బి కాలనీలోని మసీదులో నమాజులో పాల్గొన్నారు. ముస్లిం సోదరులను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. వారితో మిఠాయిలు పంచుకున్నారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారికి ఆత్మీయ స్వాగతం పలికారు.

మైలవరం తెదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ

ముస్లిం సోదర, సోదరీమణులు పవిత్ర రంజాన్‌ మాసాన్ని ఎంతో నిష్టతో కఠినంగా ఉపవాస దీక్షలను భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారని పేర్కొన్నారు. క్రమ శిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక రంజాన్ పండుగ అన్నారు. పవిత్రతకు, త్యాగానికి, సోదరభావానికి చిహ్నమైన రంజాన్ పర్వదిన వేడుకల్లో పాల్గొనటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మహమ్మద్ ప్రవక్త చెప్పిన విధంగా నడచుకోవాలన్నారు. అల్లాహ్ దయతో అందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

Related Posts

You cannot copy content of this page