SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు…

మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సభ్యులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీది బాలరాజు, కుత్బుల్లాపూర్ యూనియన్ అధ్యక్షులు కోటగడ్డ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సాయిబాబా, కోశాధికారి శేషారెడ్డి, ఉపాధ్యక్షులు కల్కి మూర్తి, సంయుక్త కార్యదర్శి మద్దయ్య, నర్సింగ్, సభ్యులు అన్వర్, శ్రీను, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS