SAKSHITHA NEWS

భారీ కాన్వాయ్ తో ప్రగతి భవన్ నుంచి మునుగోడుకు బయలుదేరిన కేసీఆర్

హైదరాబాద్‌ : మునుగోడు ప్రజా దీవెన సభకు హాజరయ్యేందుకు సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ నుంచి బయలుదేరి వెళ్లారు. పార్టీ శ్రేణులతో కలిసి సీఎం బస్సులో వెళ్తున్నారు. పార్టీ నేతల భారీ కాన్వాయ్‌ సీఎం వెంట వస్తోంది. ప్రగతి భవన్ నుంచి మునుగోడు వరకు ఆయా ప్రాంతాల్లో.. భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. సీఎం వెళ్లే మార్గమంతా పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో సందడిగా నెలకొంది.


SAKSHITHA NEWS