ఓటర్ దరఖస్తులు క్రమబద్దీకరించండి – ఓటర్ నమోదు అధికారి హరిత ఐఏఎస్

Spread the love

తిరుపతి నగరం
ఓటర్ దరఖాస్తులు క్రమబద్దీకరించి, పెండింగ్ క్లైమ్స్ ను క్షుణ్ణంగా పరిశీలించి మరో రెండు రోజుల్లోపు పూర్తి చేయాలని తిరుపతి నియోజకవర్గం ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సాయంత్రం స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం తిరుపతి నియోజకవర్గం ఓటర్ నమోదు సూపర్ వైజర్లు, అదనపు సూపర్ వైజర్లతో తిరుపతి ఓటింగ్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సంధర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బిల్వోల దగ్గర ఎలాంటి పెండింగులు వుండరాదని, బిల్వోల దగ్గర వున్న ఫారమ్ 6,7,8 క్లైమ్స్ మొత్తం మీ పరిధిలో విచారించి, పూర్తి వివరాలతో కార్యాలయానికి మరో రెండు రోజుల్లోపు సమర్పించాలన్నారు. కొత్తగా నమోదు అయిన ఓటర్ల యొక్క వివరాలు అన్ని ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వున్నాయా అని మరోసారి నిర్ధారణ చేసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పని చేస్తూ, తిరుపతి నియోజకవర్గం ఓటర్ల లిస్టును తప్పులు లేకుండా తయారు చేయాలని తిరుపతి నియోజకవర్గం ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ సూచించారు. ఈ సమావేశంలో ఓటర్ నమోదు అదనపు అధికారి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, ఆర్వో సేతుమాధవ్, డిప్యూటీ తాసీల్ధార్ జీవన్, సూపర్ వైజర్లు, అదనపు సూపర్ వైజర్లు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page