SAKSHITHA NEWS

సాయి వైభవ్ కాలనీ అసోసియేషన్ వారి ఆత్మీయ అభినందన సభలో ఎమ్మెల్యే గాంధీ కి అభినందనల వెల్లువ
శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ విజయం సాధించిన శుభసందర్బంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగుడ లోని సాయి వైభవ్ కాలనీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ వారి సతీమణి శ్రీమతి శ్యామల దేవి , మాజీ కార్పొరేటర్ సాయి బాబా ను గజమాల తో సత్కరించి, శాలవ తో సన్మానించి అభినందించిన సాయి వైభవ్ కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు నిహారిక, గ్రీన్ గ్రేస్, జైన్స్ ,కార్ల్ టన్ క్రిక్, అపర్ణ వెస్ట్ సైడ్, సాయి ఐశ్వర్య మరియు ఇతర గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్ సభ్యులు తదితరులు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ చాలా శుభ దినం అని మీ అందరి ఆత్మీయతతో మీరు చూపిన ఆదరాభిమానాలతో ఆశీర్వదించి, గెలిపించిన మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. మీ అందరి సహకారంతో ఇంతటి విజయం సాధించడం జరిగినది అని, నా మీద విశ్వాసం ఉంచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో నన్ను గెలిపించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.శేరిలింగంపల్లి ప్రజానీకానికి ఎల్లవేళల ఋణపడి ఉంటనాని , నన్ను వెన్నంటి నడిపించిన కేసీఆర్ కి , కేటీఆర్ కి, మన BRS పార్టీ కుటుంబ సభ్యులకు, కార్పోరేటర్లకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు,ఉద్యమకారులకు, కార్యకర్తలకు మరియు అభిమానులకు,కాలనీ అసోసియేషన్ సభ్యులు అందరికీ నా పేరు పేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను గాంధీ తెలియచేసారు.మరింత భాద్యతగా శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు,
సాయి వైభవ్ కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ అశోక్ రాజు, పద్మావతి జనరల్ సెక్రటరీ, కాలనీ వాసులు అప్పారావు, దిలీప్, సుధాకర్ ,బాబు, కృష్ణ, వెంకట్రావ్, రామూర్తి, బద్రీనాథ్, రమేష్ ,బీఆర్ఎస్ పార్టీ సతీష్ ,సల్లవుద్దీన్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS