వనజీవి రామయ్య కుటుంబానికి పొంగులేటి పరామర్శ

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్, పార్టీ ఎన్నికల కమిటీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మశ్రీ వనజీవి రామయ్య కుమారుడు ఇటీవల మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ముత్తుగూడెం గ్రామానికి చెందిన యరకల కౌశిక్ రెడ్డి నాయనమ్మ యరకల కౌశల్య ఇటీవల మృతిచెందగా 55వ డివిజన్ విజయనగర్ కాలనీలో వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మండల నాయకులు మద్ది కిశోర్ రెడ్డి, అజ్మీరా అశోక్ నాయక్, గోనె భుజంగ రెడ్డి, మద్ది వీరారెడ్డి, కేతినేని వేణు, బత్తుల కుర్మారావు, ఏనుగు వెంకటరెడ్డి, సుదగాని ఉపేందర్, లింగా శ్రీను, మెండె వెంకటేశ్ యాదవ్, నాగండ్ల ఉపేందర్, యువనేత గోపి తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page