పొంగులేటి ప్యాలెస్‌ @ నారాయణపురం

Spread the love

పొంగులేటి ప్యాలెస్‌ @ నారాయణపురం…

కల్లూరు(ఖమ్మం): కల్లూరు మండలంలోని నారాయణపురం గ్రామం నవ్యకాంతులతో జిగేల్‌మంటోంది..

రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్వస్థలమైన ఈ పల్లెలో ఇప్పుడు ఓ కళ్లు చెదిరే ప్యాలెస్‌ అందరినీ అబ్బుర పరుస్తోంది..

మంత్రి సోదరుడి కుమారుడు లోహిత్‌రెడ్డి వివాహ రిసెప్షన్‌ వేడుక ఆదివారం మధ్యాహ్నం నారాయణపురంలో జరగనుంది. ఇందుకోసం ఎంకే ఆర్కిటెక్ట్‌ అధినేత మల్లికార్జునరావు నేతృత్వంలో పీఎస్‌ఆర్‌ పేరుతో 70ఎకరాల్లో ఏకంగా ఓ ప్యాలెస్‌ సెట్టింగ్‌నే నిర్మించారు. ఈ వేడుకలో సుమారు 1.50 లక్షల మందికి వెజ్‌, నాన్‌వెజ్‌ భోజన ఏరాట్లు చేశారు. పలువురు మంత్రులు, వీఐపీలు రానుండటంతో భారీ ఏర్పాట్లు చేశారు. తిరువూరు క్రాస్‌ రోడ్డు వైపున హెలీప్యాడ్‌ను కూడా సిద్ధం చేశారు. ఈ నెల 14న గల్ఫ్‌లోని బహ్రెయిన్‌లో లోహిత్‌రెడ్డి పెళ్లి జరిగిన విషయం విదితమే

Related Posts

You cannot copy content of this page