నూతన వధూవరులకు పొంగులేటి ఆశీర్వాదం

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా సత్తుపల్లి, వైరా, ఖమ్మం, మధిర, పాలేరు నియోజవకవర్గాలను సందర్శించారు. ఆయా నియోజకవర్గ మండలాల్లోని గ్రామాల్లో జరిగిన పలు వివాహా వేడుకలకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా సత్తుపల్లి మండలంలోని రుద్రాక్షపల్లి గ్రామంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటి నిర్వాహకులు పొంగులేటిని ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ బాబు, బొర్రా రాజశేఖర్, విజయబాయి, సూతగాని జైపాల్ తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page