పారదర్శక ఓటర్ల జాబితా తయారీకి రాజకీయ పార్టీలు సహకరించాలి.

Spread the love

పారదర్శక ఓటర్ల జాబితా తయారీకి రాజకీయ పార్టీలు సహకరించాలి.

తిరుపతి ఓటర్ల నమోదు అధికారి, కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు సహకరించాలని తిరుపతి నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి, నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అన్నారు. నగరపాలక సంస్థలోని కమిషనర్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా సవరణపై కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష లో రాజకీయ పార్టీల ప్రతినిధులు కొన్ని సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరిస్తామని అన్నారు.


ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ పరిధిలోని పారదర్శకమైన ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు అందరూ సహకరించాలని అన్నారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికీ తిరిగి ప్రస్తుతం వున్న ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారని, పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు వారికి సంపూర్ణంగా సహకరించినట్లయితే ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించగలమన్నారు. రాజకీయ పార్టీలన్నీ ప్రతి పోలింగ్ స్టేషన్ కు బూత్ లెవెల్ ఏజెంట్ లను నియమించాలని అన్నారు.

ఓటర్ల జాబితా సవరణలో ఏవైనా సమస్యలు ఉన్న ఏ.ఈ.ఆర్.ఓ ల దృష్టికి తీసుకురావాలన్నారు. అర్హులైనప్పటికీ ప్రస్తుత ఓటర్ల జాబితాలో నమోదు కాని వారు, 1.1.2024 నాటికి 18 సంవత్సరాలు నిండి ఓటర్లుగా నమోదు కావలసినవారు, నివాసం మారినవారు, ఇటీవల మరణించిన వారి సమాచారాన్ని సేకరించి, ఓటర్ల జాబితాలో తప్పులను సరి చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ సునీత, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళిశ్వర్ రెడ్డి, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, తహశీల్దార్ వెంకటరమణ, ఈ.డి.టి. జీవన్, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page