SAKSHITHA NEWS

పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా పోలీస్ ఓపెన్ హౌస్

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో విద్యార్థులకు పోలీసు విధులు, విధానాలు వివరించారు. ఆయుధ ప్రదర్శన చేసి సమాజంలో శాంతి భద్రత రక్షణలో ఆయుధాల వినియోగం గురించి వివరించారు. కేసుల దర్యాప్తులో క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్ విభాగం, డాగ్ స్క్వాడ్ విధులు, బాంబ్ స్క్వాడ్ విధులు వివరించారు. మహిళల రక్షణలో షీ టీమ్స్ ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పి లు నాగేశ్వరరావు, జనార్ధన్ రెడ్డి, ఏ.ఆర్ డీఎస్పీ నరసింహ చారి, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఆర్ఐ నారాయణ రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS