SAKSHITHA NEWS

  • గ్రీవెన్స్ లో పలు ఫిర్యాదులను పరిశీలించి మాట్లాడిన జిల్లా యస్.పి కె.అపూర్వ రావు

నల్లగొండ (సాక్షిత ప్రతినిధి)

గ్రీవెన్స్ డే తో బాధితులకు ఎంతో బరోసా అని యస్.పి అపూర్వ రావు ఐ పి.యస్ అన్నారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 30 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు.
ఈ సందర్బంగా యస్.పి మాట్లాడుతూ ఈ రోజు వచ్చిన పిర్యాదులు భూ సమస్యలు, ఆడపిల్లలు పుట్టారని కారణంగా తన భర్త తీసుకెళ్లడం లేదు అని, అధిక వడ్డీ వసూలు చేస్తూ ఇబ్బందులు పెడ్తున్నాడు అనే సమస్యల పైన పిర్యాదులు రావడం జరిగిందనిఅన్నారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని పోలీస్ అధికారులకు స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై వేగంగా స్పందించి పోలీసు సేవలు అందజేయాలన్నారు. ప్రతి ఫిర్యాదుదారునికి భరోసా,నమ్మకం కలిగించాలని అన్నారు. ఎవరైనా చట్టవ్యతిరకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కటినంగా వ్యవహరించాలని అన్నారు. బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.


SAKSHITHA NEWS