ఈవీఎం యంత్రాలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలోని శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల భవనంలో ఈవీఎం యంత్రాలను భద్రపరచిన
స్ట్రాంగ్ రూమ్స్ నలువైపులా కేంద్ర పోలీస్ బలగాలు, జిల్లా ఆర్మ్ డ్ పోలీస్, సివిల్ పోలీసులతో మూడంచెల భద్రతతో పాటు నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో పటిష్టమైన రక్షణ వుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు కూడా తావు లేకుండా పోలీసు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతూ… సిబ్బందిని నిరంతరం అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, సిఐ రాజిరెడ్డి పాల్గొన్నారు.
స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రతను పరిశీలించిన పోలీస్ కమిషనర్
Related Posts
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ
SAKSHITHA NEWS రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కానిస్టేబుల్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు గద్వాల్:-జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిదిలోని కేటీ దొడ్డి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తున్న మహిళ…
తన్విందర్ సింగ్ ని అరెస్టు చేయాలి.
SAKSHITHA NEWS తన్విందర్ సింగ్ ని అరెస్టు చేయాలి.కూకట్పల్లి నియోజకవర్గం మట్టే ప్రసన్న కుమార్ ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బి మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ…