అజర్ బైజాన్ దేశ పర్యటన ముగించుకుని ఇరాన్ తిరిగి వెళ్తుండగా ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదంలో అధ్యక్షుడు సయ్యద్ తో పాటు మరో ఐదుగురు కూడా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ యొక్క విషాద మరణం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అతని కుటుంబానికి, ఇరాన్ ప్రజలకు నా హృదయపూర్వక సానుభూతి. ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్కు అండగా నిలుస్తోందని ప్రధాని మోడీ తన ట్వీట్ లో తెలిపారు.
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం.. ప్రధాని మోడీ సంతాపం
Related Posts
సనాతన ధర్మంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
SAKSHITHA NEWS సనాతన ధర్మంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు… స్పందించిన ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరన్న పవన్ కల్యాణ్ ఉదయనిధి మారన్కు తమిళంలో కౌంటర్ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం వెయిట్ అండ్ సీ అన్న ఉదయనిధి స్టాలిన్…
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్
SAKSHITHA NEWS ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ ఏడుగురు మావోయిస్టులు మృతి.. దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులో ఎదురుకాల్పులు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం.. SAKSHITHA NEWS