SAKSHITHA NEWS

Pilgrimage to Tirumala with admiration for the Minister.

మంత్రిపై అభిమానంతో తిరుమలకు పాదయాత్ర
మహబూబ్ నగర్ నుంచి తిరుమల పాదయాత్ర చేపట్టిన కృష్ణా గౌడ్

నాయకుల మీద అభిమానంతో పెద్దపెద్ద కటౌట్లు ఏర్పాటు చేసే అభిమానులు కార్యకర్తలు ఉన్నారు… కానీ ఓ అభిమాని తన అభిమాన నాయకుడు రాబోయే ఎన్నికల్లో అఖండ విజయం సాధించాలని వెంకటేశ్వర స్వామిని వేడుకునేందుకు పాదయాత్ర చేపట్టాడు.

మహబూబ్ నగర్ నుంచి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలకు చేపట్టిన పాదయాత్రను మంగళవారం నాడు మహబూబ్ నగర్ లో మంత్రి ప్రారంభించారు.


రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఘన విజయం సాధించాలని, ఆయన కలకాలం క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ….

ఈ పాదయాత్ర చేపట్టినట్లు ఆయన అభిమాని అయిన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఎం కృష్ణ గౌడ్ తెలిపారు. నిత్యం జనం కోసం పరితపించే మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలకాలం సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని తాను పాదయాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు.


SAKSHITHA NEWS