ఐకెపి వివోఎ ల సమస్యల పరిష్కారంకై రేవంత్ రెడ్డికి వినతిపత్రం

Spread the love

ఐకెపి వివోఎ ల సమస్యల పరిష్కారంకై రేవంత్ రెడ్డికి వినతిపత్రం

చిట్యాల సాక్షిత ప్రతినిధి

కనీస వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని గత పది రోజుల నుంచి ఐకెపి వివోఏలు నిరసన ధర్నా చేస్తున్నారు. ఈ సందర్భంగా సిఐటియు నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు నారబోయిన శ్రీను ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గం వివోఎ ల ఉద్యోగ సంఘం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి కి వినతి పత్రం అందజేసి చాలీచాలని జీతాలతో వివో ఏ లను వెట్టిచాకిరి చేస్తున్నారని వారిని గుర్తించి కనీస వేతనం 26వేలు, ఉద్యోగ భద్రత, సర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు. కచ్చితంగా వివోఏ ల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా వివోఏలకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నకిరేకల్ నియోజకవర్గంలోని మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page