ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ గా ఉన్న కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారీ మెజారిటీతో గెలువడంతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
![ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజాప్రతినిధులు, ప్రజలు… 2 Whatsapp Image 2023 12 06 At 11.56.13 Am](https://sakshithanews.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-06-at-11.56.13-AM-1024x683.jpeg)