SAKSHITHA NEWS

కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్…

అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని, చంద్రబాబు ఏ తప్పు చేయలేదని అక్రమంగా అరెస్ట్ చేశారని 80 దేశాల్లో చంద్రబాబుకు సంఘీభావంగా మద్దతు తెలుపుతున్నారని కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు తెలిపారు.

అనంతపురం పట్టణంలో బాబుతో నేను సైతం అంటూ కాగడా ప్రదర్శనకు వెళ్లకుండా పోలిస్ లు ముందస్తు అరెస్టు పేరుతో నోటీసులు ఇవ్వడం అధికార దర్పణంతో పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని అయినప్పటికీ ఏ గ్రామంలో చూసినా చంద్రబాబు నాయకత్వం కోసం కోరుకుంటూ ముందుకు సాగుతున్నారు అన్నారు. న్యాయం కోసం పోరాడుతూ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ రాజ్యాంగం కోసం ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు రోడ్డుపైకి వచ్చి పోరాటం చేస్తున్నారన్నారు చంద్రబాబు నాయుడు జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు..


SAKSHITHA NEWS